మతనగారి పల్లిలో తీరిన నీటి సమస్య

మతనగారి పల్లిలో తీరిన నీటి సమస్య

SS: కదిరి నియోజకవర్గం మతనగారిపల్లిలో ఐదు రోజులుగా ఉన్న నీటి సమస్యను YCP నేత డా.బత్తల హరిప్రసాద్ పరిష్కరించారు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన హరిప్రసాద్ వ్యక్తిగత చొరవతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. గడ్డు పరిస్థితుల్లో అండగా నిలిచినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.