'గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాసకేంద్రాలు'
BHNG: గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య అన్నారు. విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పోచంపల్లి మండలం విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని కార్యక్రమం నిర్వహించారు.