జాతీయ రహదారిపై వాహనదారులకు అవగాహన
కృష్ణా: మచిలీపట్నంలోని జాతీయ రహదారి 216పై డీఎస్పీ రాజా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మంగళవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. తక్కువ వేగంతో ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.