వందేమాతరంపై పార్లమెంటులో చర్చ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై ప్రత్యేక చర్చను జరపనున్నారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా చర్చించనున్నారు. ఇందుకోసం లోక్సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. స్వాతంత్ర్య పోరాటంలో స్ఫూర్తిదాయక గీతంగా నిలిచిన వందేమాతరంపై జరిగే చర్ఛలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. గురువారం లేదా శుక్రవారం రోజున ఈ చర్చను ప్రారంభించనున్నారు.