ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ
MDK: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు 3 నెలల సన్న బియ్యం నిల్వలు రేషన్ సమృద్ధిగా ఉంచబడి, నిరంతరంగా సరఫరా చేయబడుతున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు. 30 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుందని, ప్రతి లబ్ధిదారుడు ఎలాంటి తొందరపాటు లేకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు పొందవలసిందిగా కోరారు.