ఇంటర్ పరీక్షకు 374 మంది గైర్హాజరు
KRNL:ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సోమవారం జరిగిన పరీక్షకు 374 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని RIO జి.లాలెప్ప తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,847 మంది విద్యార్థులకు గాను, 15,473 మంది హాజరు కాగా.. 374 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు.