వేగంగా దూసుకు వచ్చిన టిప్పర్.. కుట్టు మిషన్లు ధ్వసం
BDK: ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో తెల్లవారుజామున అతివేగంతో దూసుకొచ్చిన ఓ టిప్పర్ బీభత్సం సృష్టించినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన ఉన్న కుట్టు మిషన్ల యూనిట్ను ఢీకొనడంతో షెడ్లు, యంత్రాలు ధ్వంసమయ్యాయి. యూనిట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పిందని అన్నారు.