నేడు చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత
ATP: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు నేడు మూతపడనున్నాయి. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి, కదిరి లక్ష్మీ నరసింహ స్వామి తదితర ఆలయాల ద్వారాలను గ్రహణ కాలంలో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు. గ్రహణం ముగిసిన తర్వాత శాంతి పూజలు, సంప్రోక్షణ అనంతరం తిరిగి భక్తులకు దర్శనం కల్పించననున్నట్లు వెల్లడించారు.