పుంగనూరులో బ్లడ్ బ్యాంకు కోసం వినతి పత్రం
CTR: పుంగనూరులో ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరుతూ SDPI పార్టీ శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయానికి రక్తం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కావున ఒక బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వారు కోరారు.