గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ గమ్యం కుదింపు

VSP: బొబ్బిలి, పార్వతీపురం సెక్షన్లలో మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా గుంటూరు-రాయగడ (17243) ఎక్స్ప్రెస్ రైలు ఆగస్టు 19 నుంచి 26 వరకు విజయనగరం వరకే నడుస్తుందని వాల్తేరు డివిజనల్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. తిరుగు ప్రయాణం రాయగడ-గుంటూరు (17244) ఎక్స్ప్రెస్ ఆగస్టు 20 నుంచి 27 వరకు విజయనగరం నుంచే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.