నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర రామారెడ్డి, పోసానిపేట్, మాచారెడ్డిలో సర్పంచ్ ఎలక్షన్ల నామినేషన్ల కొరకు ఏర్పాటు చేసిన కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.