ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి

ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి

PDPL: ఓదెలలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి, బోనాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. భక్తులు తలనీలాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.