ఎమ్మెల్యేను కలిసిన ఎస్సై
ELR: తడికపూడి పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వల్లి పద్మ సోమవారం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ చరిత్రలో ఒక మహిళ ఎస్సైగా రావడం విశేషమని అన్నారు. మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయాలని, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని నిలువరించేందుకు కృషి చేయాలన్నారు.