బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి: మంత్రి
SS: మంత్రి సత్య కుమార్ యాదవ్ హైదరాబాదులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు. దీపక్ రెడ్డికి మద్దతుగా నిలవాలని, కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.