పెరిగిన మిర్చి ధరలు

WGL: వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. బుధవారం 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,100 ధర పలకగా.. గురువారం రూ.14,300కి చేరింది. అలాగే, వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.14,200 ధర వస్తే నేడు రూ.14,500కి చేరుకుంది. మరోవైపు తేజ మిర్చి ధర బుధవారం రూ.14వేలు పలకగా.. ఈరోజు సైతం అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.