రేపు రేవుల లీజ్ వేలం.. ముందస్తు టెండర్ తప్పనిసరి..!
గుంటూరు జడ్పీ కార్యాలయంలో రేవుల లీజ్ హక్కుల కోసం బుధవారం వేలం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సీల్ టెండర్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2:30కి బహిరంగ వేలం జరుగుతుంది. టెండర్ దాఖలు చేసిన వారికే పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరన్నారు. అధికారులు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయమని వెల్లడించారు.