'సైబర్ నేరాలపై అవగాహనే ఆయుధం'

ADB: సైబర్ నేరాలపై అవగాహనే ఆయుదమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో 21 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని ఆదిలాబాద్ టూ టౌన్, భీంపూర్, ADB రూరల్, బోథ్ పోలీస్ స్టేషన్లలో పలు విధాలుగా సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. సైబర్ క్రైమ్కు గురైతే https://www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు.