రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లింగేశ్వర్ యాదవ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరమర్శించారు. ఆరోగ్య స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం తీసుకోవాల్సిందిగా సూచించారు.