కరోనా కేసులు.. ప్రజలకు అలర్ట్ జారీ

AP: దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. సమూహాలుగా ఉండొద్దని సూచించింది. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశించింది. వృద్ధులు, గర్భవతులు బయటకు రావొద్దని హెచ్చరించింది. వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది.