ప్రజల నుంచి చెత్తను సేకరించిన స్వచ్ఛ రథం
AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం, వమ్మవరంలో స్వచ్ఛరథం శుక్రవారం చెత్తను సేకరించి ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను అందజేసింది. డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛరథం సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛ రథం దోహదపడుతుందన్నారు. ప్రజలు పొడి చెత్తను స్వచ్చ రధానికి అందించి అవసరమైన నిత్యవసర సరుకులను తీసుకోవాలన్నారు.