కారు బైకు ఢీ.. వ్యక్తి మృతి

కారు బైకు ఢీ..  వ్యక్తి మృతి

MHBD: గార్ల మండల కేంద్రంలని తిర్జాపురం స్టేజి వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న బాదం సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.