గుంటూరులో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసులు మృతి

ప్రకాశం: గుంటూరు నగర శివారు NH-16పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్నారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్‌గా పోలీసులు గుర్తించారు.