ఆచంటలో అంబులెన్స్ ఏర్పాటుకు వినతి
W.G: ఆచంటలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆచంట మండల మానవత సభ్యులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. మంగళవారం కొమ్ముచిక్కాలలో ఆయన స్వగ్రామంలో కలిసి పలు సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ.. మానవత ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అంబులెన్స్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.