ప్రజా పోరాటం ఆగదు: సీపీఐ
GDWL: దేశ దోపిడీ పాలకవర్గాలు పోరాడుతున్న నాయకులను బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చినంత మాత్రాన విప్లవం అంతం కాదని, దేశంలో దోపిడీ ఉన్నంత వరకు ప్రజా పోరాటాలు వర్ధిల్లుతాయని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జమ్మిచేడు కార్తీక్ అన్నారు. ఆదివారం ఐజ మండల కేంద్రంలో జరిగిన అమరవీరుల వర్ధంతి సభలో ఆయన పలుగోనీ నివాళులర్పించి ప్రసంగించారు.