ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు: కలెక్టర్
సత్యసాయి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు విరాజిల్లాలని ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవాలని ఆయన కోరారు.