పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 12,079 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారని, దీనికి 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.