ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
బాపట్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోడౌన్ను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పరిశీలించారు. గోడౌన్లో నిల్వ ఉన్న ఈవీఎంల రిజిస్టర్ను ఆయన పరిశీలించి, సిబ్బంది పనితీరు, పరిసరాలను సమీక్షించారు. అనంతరం రిజిస్టర్లలో సంతకాలు చేశారు.