వైసీపీ పార్లమెంటు స్టేట్ సెక్రటరీగా షర్మిలా రెడ్డికి చోటు
EG: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్టేట్ సెక్రటరీగా మేడపాటి షర్మిల రెడ్డి బుధవారం నియమితులయ్యారు. ఈమె రాజమండ్రి నగర వాసి, సీనియర్ నాయకురాలుగా అందరికీ సుపరిచితురాలు. ఈమె గతంలో మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, రుడా చైర్ పర్సన్గా పనిచేసి వైసీపీ పార్టీకి సేవలందించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధినేత జగన్కి కృతజ్ఞతలు తెలిపారు.