'దివ్యాంగుల సంక్షేమ పథకాలను అమలు చేయాలి
ADB: దివ్యాంగుల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం నిర్వహించి, అజెండా అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న 4శాతం రిజర్వేషన్లను అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.