'పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలి'
ADB: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు పని చేయాలని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. గురువారం ప్రజా సేవాభవన్లో ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పరిధిలోని నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.