మూల్యాంకన పారితోషకం విడుదలచేయాలి: TTJAC
SDPT: గత ఏడాది పదో తరగతి పరీక్షల మూల్యాంకన పారితోషకాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TTJAC, USPC, JACTO ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పారితోషకాన్ని 50 శాతం పెంచాలని, ఈ ఏడాది మూల్యాంకనం పూర్తయిన వెంటనే నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.