ఈనెల 12న సర్వసభ్య సమావేశం: MDO రాజ్యలక్ష్మి
PLD: కొరిశపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎండీవో రాజ్యలక్ష్మి శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు. మండలంలో ఉన్న ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు సమావేశానికి హాజరు కావాలని కోరారు.