నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
KMM: సింగరేణి మండలంలో ఇవాళ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ తెలిపారు. ఉదయం 11:30 గంటలకు ఉసిరికాయలపల్లిలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయనున్నారు. మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.