చిలుకానగర్ పాఠశాలకు డిప్యూటేషన్పై నలుగురు టీచర్లు
MDCL: చిలుకానగర్ MPPS పాఠశాలలో టీచర్లు కొరత ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రిన్సిపల్ అంజిరెడ్డి స్థానిక కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జిల్లా ఎడ్యుకేషన్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, నలుగురు టీచర్లను డిప్యూటేషన్పై పాఠశాలకు పంపించారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.