ఈనెల 20న మేడిగడ్డకు సీఎం రేవంత్
BHPL: కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ను ఈనెల 20న CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. వీలైనంత త్వరగా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఇటీవలే ఆదేశించారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచరం.