జిల్లాకు చేరుకున్న 1,277 టన్నుల ఎరువులు
ఉమ్మడి అనంతపురం జిల్లాకు బుధవారం రైలు ద్వారా స్పిక్ కంపెనీ నుంచి 1,277 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు చేరుకున్నాయి. ఇందులో యూరియా 1,086 టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 128 టన్నులు ఉన్నాయి. వీటిని మార్క్ ఫెడ్, ప్రైవేటు డీలర్లతో పాటు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తాలకు ప్రతినిధులు, డీలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.