ముగ్గురు కార్పొరేషన్‌ ఛైర్మన్లకు కేబినెట్‌ హోదా

ముగ్గురు కార్పొరేషన్‌ ఛైర్మన్లకు కేబినెట్‌ హోదా

AP: రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ, SC కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్‌, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్ అలపాటి సురేష్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి జిల్లా, రాష్ట్రస్థాయిలో కూడా కేబినెట్‌ హోదాలోనే ప్రొటోకాల్‌ అమలు చేయనున్నట్లు పేర్కొంది.