వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్సై
VZM: కొత్తవలస మండల కేంద్రంలో వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై ఎస్సై ఎన్. జోగారావు బుధవారం అవగాహన కల్పించారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడపకూడధని సూచించారు. ట్రీబీల్ రైడింగ్ చేయకూడదని తెలిపారు. వాహనాలకు ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.