'గీతన్నల రణభేరి బహిరంగ సభను జయప్రదం చేయండి'
సూర్యాపేటలో ఈనెల 28న జరగనున్న కల్లు గీత కార్మిక సంఘం 'గీతన్నల రణభేరి' బహిరంగ సభను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బత్తుల జనార్దన్ గౌడ్ కోరారు. బుధవారం నాగారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు.