శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..?
తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 71,208 మంది దర్శనం చేసుకోగా 23,135 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు రూ. 3.84 కోట్లు కానుకలు హుండీలో సమర్పించారు.