విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైసీపీ పోరుబాట

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైసీపీ పోరుబాట

VZM: పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వైసీపీ కార్యాలయం నుంచి గజపతినగరం సబ్ స్టేషన్ వరకు పలు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏడీఈకి వినతి పత్రాన్ని అందజేశారు. నాలుగు మండలాల నుంచి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.