‘కాలేజీ కరెస్పాండెంట్పై చర్యలు తీసుకోవాలి’

KDP: శ్రీ విజయదుర్గ నర్సింగ్ కాలేజీలో చదివే సరస్వతిని కరెస్పాండెంట్ రమణారెడ్డి బండ బూతులతో దూషించి, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఫీజు విషయంలో వివాదం జరిగితే ఆమెను మానసికంగా, భౌతికంగా వేధించారని తెలిపారు. ఈ ఘటనను ఖండించిన విద్యార్థి సంఘాలు, ప్రజా నాయకులు ఆయనపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.