యుద్ధం.. దుబాయ్‌లో హై అలర్ట్

యుద్ధం.. దుబాయ్‌లో హై అలర్ట్

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దుబాయ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. నగరంపై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో UAE ప్రభుత్వం, దుబాయ్ భద్రతా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఇవాళ దుబాయ్‌లోని నివాసితులు, పర్యాటకుల ఫోన్లకు అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపారు. ఎప్పుడైనా క్షిపణుల దాడి జరగొచ్చని అప్రమత్తంగా ఉండాలన్నారు.