వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.6,880 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి రూ.17వేలు, వండర్ హాట్(WH) మిర్చి రూ.19,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,600, దీపిక మిర్చి రూ.16వేల ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.