BREAKING: రేపు సాయంత్రంలోగా పరిహారం

AP: పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, పిడుగుపడి మరణించిన వారి కుటుంబాలకూ సాయం అందిస్తామన్నారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని, విపత్తుల వేళ అధికారులు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. అధికారులు మరో రెండ్రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.