జూబ్లీహిల్స్ ప్రచారంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ప్రచారంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే

NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా షేక్ పేట డివిజన్లోని పారామౌంట్ కాలనీ, బృందావన్ కాలనీల్లో మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్లోని ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాధ్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.