నల్లగొండలో డ్రగ్స్ విక్రయ ముఠా అరెస్ట్

NLG: నల్గొండ పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితుల వద్ధ నుంచి రూ.25 వేల విలువ కలిగిన మత్తు మాత్రలను, రూ.22 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేస్తుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమామేశంలో వివరాలు వెల్లడించారు.