ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గెవ్రాయ్ సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారిపై గాంధీ వంతెన వద్ద ఓ కారు డివైడర్ను ఢీ కొట్టింది. ఆ సమయంలో వారికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ వాహనంలోని బయటకు వస్తున్న సమయంలో వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.