చేబ్రోలు రైల్వే గేటు వద్ద ట్రాక్ మరమ్మత్తు పనులు
ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే గేటు వద్ద ట్రాక్ మరమ్మత్తు పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ పనులు ఈనెల 20 తేదీ వరకు జరుగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మరమ్మత్తుల వలన 20 తేది వరకు రైల్వే గేటు మూసివేస్తున్నారు. వాహనదారులు గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలని ఏర్పాటు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.