పలు పనులకు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన
AP: అమరావతిలో జాతీయ బ్యాంకుల భవన నిర్మాణాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 21 బ్యాంకులు, మూడు ఇన్సూరెన్స్, ఇన్కమ్ టాక్స్ కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల పలువురు పాల్గొన్నారు.